nagashourya: ఓ నిర్మాత డబుల్ గేమ్ ఆడాడు.. అందుకే నిర్మాతగా మారాను!: నాగశౌర్య

  • ఆ నిర్మాత మా ఇద్దరి వద్ద రెండు రకాలుగా చెప్పాడు  
  • అందుకే సొంత బ్యానర్ ఆలోచన చేశాం 
  • ఈ సినిమా ఓ ఎమోషనల్ జర్నీ

లవర్ బాయ్ గా నాగశౌర్యకి మంచి క్రేజ్ వుంది. ఆయన తాజా చిత్రంగా వచ్చేనెల 2వ తేదీన 'ఛలో' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నాగశౌర్య సొంత బ్యానర్ పై తెరకెక్కింది. అప్పుడే సొంత బ్యానర్ ను స్టార్ట్ చేయవలసిన అవసరం ఏవుంది? అనే ప్రశ్నకు తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.

" ఈ కథ తీసుకుని దర్శకుడు వెంకీ కుడుముల ఓ నిర్మాత దగ్గరికి వెళితే, 'నాగశౌర్యతో ఎందుకూ .. వేరే హీరోతో చేద్దాం' అన్నాడు. "ఆ తరువాత అదే కథను తీసుకుని నేను అదే నిర్మాత దగ్గరికి వెళ్లాను. 'దర్శకుడిగా వెంకీ కుడుముల వద్దు మార్చేద్దాం .. అని ఆ నిర్మాత అన్నాడు. దాంతో "ఎందుకు సార్ .. మాతో డబుల్ గేమ్ ఆడతారు?" అని ముఖం మీదే చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసినట్టుగా నాగశౌర్య చెప్పాడు. ఆ సంఘటన తరువాతనే ఈ సినిమాను సొంత బ్యానర్లో చేయాలనే నిర్ణయానికి వచ్చామని ఆయన అన్నాడు. ఈ సినిమా ఒక ఎమోషనల్ జర్నీ అనీ .. ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని చెప్పుకొచ్చాడు.      

More Telugu News