sai dharam tej: 'ఇంటిలిజెంట్' ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా చిరూ?

  • ఈ రోజు రాత్రి ఓ సాంగ్ రిలీజ్ 
  • వచ్చేనెల 4వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • వచ్చేనెల 9వ తేదీన సినిమా రిలీజ్

సాయిధరమ్ తేజ్ హీరోగా వినాయక్ 'ఇంటిలిజెంట్' సినిమాను తెరకెక్కించాడు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమాను వచ్చేనెల 9వ తేదీన అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా, 'కళ కళ కళామందిర్' అనే సాంగ్ ను ఈ రోజు రాత్రి 7 గంటలకు ఈ సినిమా టీమ్ రిలీజ్ చేయనుంది.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వచ్చేనెల 4వ తేదీన రాజమండ్రిలో జరపనున్నారు. ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను బాలకృష్ణతో రిలీజ్ చేయించిన టీమ్, ఫస్టుసాంగ్ ను ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ చేయించింది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా చిరంజీవి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాతో తేజూకు హిట్ పడుతుందేమో చూడాలి మరి.    

More Telugu News