allu arjun: 'నా పేరు సూర్య' ఓ ఎమోషనల్ జర్నీ

  • పాటలు .. ఫైట్స్ శాతం తక్కువే 
  • ఎమోషన్ కి ఎక్కువ ప్రాధాన్యత 
  • ఏప్రిల్ 27వ తేదీన విడుదల    

అల్లు అర్జున్ .. వక్కంతం వంశీ కాంబినేషన్లో 'నా పేరు సూర్య' సినిమా తెరకెక్కుతోంది. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ .. ఈ సినిమాపై అమాంతంగా అంచనాలను పెంచేసింది.

సాధారణంగా అల్లు అర్జున్ సినిమాల్లో పాటలకు .. డాన్సులకు .. ఫైట్స్ కి అధిక ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఆ స్థాయిలో ఈ సినిమాలో పాటలు .. ఫైట్లు ఉండవని తెలుస్తోంది. అలాగని చెప్పేసి ఆ లోటు తెలియదని అంటున్నారు. ఓ ఎమోషనల్ జర్నీలా ఈ సినిమా కొనసాగుతుంది గనుక, అది ఆడియన్స్ ను ఆద్యంతం కట్టిపడేస్తుందని చెబుతున్నారు. దేశ రక్షణ కోసం ఆరాటపడే ఓ సైనికుడిగా అల్లు అర్జున్ నటనకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండటం కష్టమనే అభిప్రాయాలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 27వ తేదీన ఈ సినిమా థియేటర్స్ లోకి రానుంది.   

More Telugu News