gopichand: మెహ్రీన్ తో కలిసి రెడీ అవుతోన్న గోపీచంద్

  • షూటింగు దశలో గోపీచంద్ 25వ సినిమా
  • వచ్చేనెల 5వ తేదీ నుంచి రెండవ షెడ్యూల్ 
  • మే 18వ తేదీన భారీ స్థాయిలో విడుదల    

విలన్ గా ఎంట్రీ ఇచ్చి .. యాక్షన్ హీరోగా మంచి మార్కులు కొట్టేసిన గోపీచంద్, ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ తోను శభాష్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఆయన తన 25వ సినిమాను చక్రి దర్శకత్వంలో చేస్తున్నాడు. రాధామోహన్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో, మెహ్రీన్ కథానాయికగా నటిస్తోంది.

రీసెంట్ గా ఫస్టు షెడ్యూల్ లో ఇంటర్వెల్ ఎపిసోడ్ చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఫిబ్రవరి 5వ తేదీ నుంచి రెండవ షెడ్యూల్ ను మొదలెట్టనుంది. ఈ సినిమాకి 'పంతం' .. 'శపథం' అనే టైటిల్స్ పరిశీలనలో వున్నాయి. మే 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఇక గోపీచంద్ తన 26వ సినిమాను బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణంలో .. వీరు పోట్ల దర్శకత్వంలోను, 27వ సినిమాను తమిళ దర్శకుడు 'తిరు'తోను చేయనున్నట్టు సమాచారం.   

More Telugu News