apcc: ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ కార్యాల‌యంలో గాంధీ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం

  • హాజ‌రైన అధికార ప్ర‌తినిధులు
  • పూల మాల‌లు వేసి నివాళులు
  • గాంధీ కృషి మ‌రువ‌లేనిద‌న్న వి. గురునాధం

జాతిపిత మ‌హాత్మ‌గాంధీ 70వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ రాష్ట్ర కార్యాల‌యంలో నివాళి కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ఏపీసీసీ అధికార ప్ర‌తినిధులు వి.గురునాధం, వింతా సంజీవ‌రెడ్డి, నిమ్మ‌ల జ్యోతిక, నెల‌కుదిట వెంక‌య్య‌లు హాజ‌ర‌య్యారు. వీరంతా గాంధీ చిత్ర‌ప‌టానికి పూలమాల‌లు వేసి నివాళులు అర్పించారు.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ... యువ‌త గాంధీజీని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని, వారి ఆశ‌యాల‌ను సాధించ‌డానికి తీవ్రంగా క‌ష్ట‌ప‌డాల‌ని, బ్రిటిష్ వారిని త‌రిమేయ‌డానికి గాంధీజీ ఉప‌యోగించిన విధానాల ద్వారా దేశం పురోగ‌తి చెందుతుంద‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో న‌గ‌ర మ‌హిళా కాంగ్రెస్ అధ్య‌క్షురాలు కె. శ్రీల‌క్ష్మి, వివిధ‌ విభాగాల నాయ‌కులు పాల్గొన్నారు.

More Telugu News