Hyderabad: లవర్ తో జల్సాల కోసం బడాబాబుకు గాలమేసి పెళ్లి చేసుకున్న యువతి!

  • విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన పావని
  • ప్రియుడికి డబ్బు కోసం ఆస్తిపరుడితో వివాహం
  • ఆపై దొంగతనాలు చేస్తూ చిక్కిపోయిన కిలేడీ!

తాను వలచిన యువకుడితో కలసి జల్సాలు చేసేందుకు ఏకంగా ఓ బడాబాబును పెళ్లి చేసుకుని, అతని ఇంటి నుంచి ఒక్కో వస్తువునూ దొంగతనం చేస్తూ, భర్తకు వచ్చిన అనుమానంతో పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది ఓ యువతి. మరిన్ని వివరాల్లోకి వెళితే, విజయవాడకు చెందిన పావని (28)కి హైదరాబాద్, అంబర్ పేటలో ఉండే కిషోర్ అనే యువకుడికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సట్టా నిర్వహించే కిషోర్ ను ఇష్టపడ్డ పావని, అతన్ని పెళ్లి చేసుకోవాలని భావించింది. ఈ క్రమంలో అతనికి పలుమార్లు డబ్బులు కూడా ఇచ్చింది. వీరిద్దరూ కలసి సట్టా కోసం అప్పుడప్పుడూ ముంబై వెళ్లి వస్తుండేవారు.

 గతంలో టర్కీ కరెన్సీని సరఫరా చేస్తూ పావని పోలీసులకు పట్టుబడి జైలుకు కూడా వెళ్లి వచ్చింది. ఇక డబ్బుల సర్దుబాటు కష్టం కావడంతో, కొత్త ప్లాన్ ఆలోచించింది. ఆర్థికంగా స్థిరపడిన రమేష్ అనే యువకుడిని పెళ్లి పేరిట నమ్మించింది. అతన్ని పెళ్లి చేసుకుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న రమేష్ కు సౌతాఫ్రికాలో జాబ్ కూడా వచ్చింది. ఇక తన ప్రియుడి కోసం ఆమె రమేష్ ఇంట్లో పలుమార్లు చోరీలకు పాల్పడింది. ఆ డబ్బును తీసుకెళ్లి కిషోర్ కు ఇచ్చేది. పావని విషయం తెలుసుకున్న రమేష్ కుటుంబీకులు ఆమెను గెంటేశారు.

అప్పటికీ మారని ఆమె, అమీర్ పేట హాస్టల్ లో చేరి, నకిలీ కార్డు చూపించి, పలువురు యువతులతో స్నేహం చేసింది. ఉష అనే యువతి బీరువా నుంచి 7 తులాల బంగారం దొంగిలించి, కిషోర్ ను తీసుకుని ముంబై వెళ్లి జల్సా చేసి వచ్చింది. ఉష ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, పావనిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు పంపారు.

More Telugu News