finance minister: ఆర్థిక సర్వేను లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి!

  • 2018-19లో జీడీపీ వృద్ధి 7-7.5 శాతం మధ్య వుండొచ్చని అంచనా
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇది 6.5 శాతం
  • లోక్‌సభ సమావేశాలు గురువారానికి వాయిదా 

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2018 ఆర్థిక సర్వేను సోమవారం మధ్యాహ్నం పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

సర్వే ముఖ్యాంశాలు....

  • 2018-19 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7 నుంచి 7.5 శాతం మధ్య వుండొచ్చు.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇది 6.5 శాతానికి చేరుకుంటుంది. 
  • మధ్యకాలికంగా దృష్టి సారించాల్సిన రంగాలు - వ్యవసాయం, విద్య, ఉపాధి. వీటికి అధిక ప్రాధాన్యత ఇస్తాం.
  • పెరుగుతున్న చమురు ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి.
  • సౌదీ ఆరామ్‌కో లిస్టయితే చమురు ధరలు మరింత పెరగొచ్చు.
  • ప్రత్యక్ష పన్నుల వసూలు లక్ష్యాన్ని ఈ ఆర్థిక సంవత్సరం చేరుకునే అవకాశం.
  • జీడీపీ వృద్ధి కోసం గత ఏడాది కాలం నుంచి అనేక సంస్కరణలు చేపట్టాం.
  • 2017-18లో ఎగుమతులు వృ‍ద్ధి రేటు 12.1 శాతంగా ఉండనున్నట్టు తెలిపింది.
  • తొలిసారి భారతీయ చరిత్రలో మహారాష్ట్ర, గుజరాత్‌, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు దేశీయ ఎగుమతుల్లో 70 శాతాన్ని నమోదుచేసినట్టు పేర్కొంది.
  • 2019 ఆర్థిక సంవత్సరంలో సగటున క్రూడ్‌ ఆయిల్‌ ధరలు 12 శాతం పెరిగే అవకాశముందని పేర్కొంది.
 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన అనంతరం లోక్‌సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.

More Telugu News