both houses: ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి తొలిసారి ప్ర‌సంగించిన రాష్ట్ర‌ప‌తి

  • ప్రారంభ‌మైన పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు
  • ప్ర‌భుత్వ విజ‌యాల‌ను కొనియాడిన రామ్‌నాథ్ కోవింద్‌
  • దేశం అభివృద్ధి బాట‌లో న‌డుస్తోంద‌ని వ్యాఖ్య‌

రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన త‌ర్వాత తొలిసారి రామ్‌నాథ్ కోవింద్ ఉభ‌య‌స‌భ‌లను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఇవాళ ప్రారంభ‌మైన పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఆయ‌న ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాలు, ప‌థ‌కాల గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. పేద‌లు, ఉన్న‌త వ‌ర్గాల మ‌ధ్య అంత‌రాన్ని త‌గ్గించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, రైతుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉండి, వారి ఆదాయాన్ని పెంచే ప్ర‌య‌త్నం చేయాల‌ని ఆయ‌న అన్నారు. వారి అవ‌స‌రార్థం ప్ర‌వేశ‌పెట్టిన ఇనామ్ పోర్ట‌ల్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భించింద‌ని పేర్కొన్నారు.

స్వ‌యం స‌హాయ‌క బృందాల‌ను ప్రోత్స‌హిస్తూ, దేశ అభివృద్ధిలో వారిని భాగం చేయాల‌ని రామ్‌నాథ్ కోవింద్ వివ‌రించారు. దేశ స్వ‌ప్నాలను సాకారం చేసుకునేందుకు కృషి చేయాల‌ని, ట్రిపుల్ త‌లాక్ బిల్లు ఆమోదం పొందుతుంద‌ని తాను ఆశిస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. రైతుల గురించి తన ప్ర‌సంగంలో ఎక్కువగా ప్ర‌స్తావించారు. ఆదివాసీలు, గ్రామీణులు, వృద్ధులు, దివ్యాంగులు, మ‌హిళ‌లు, మైనార్టీల‌ కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాలు, ప్ర‌యోజ‌నాలు, వాటిలో సాధించిన విజ‌యాల గురించి ఆయ‌న చెప్పారు. ముస్లిం హ‌జ్ యాత్ర‌లో ప్ర‌భుత్వం చేసిన మార్పుల కార‌ణంగా ముస్లిం మ‌హిళ‌ల‌కు ప్ర‌యోజనం చేకూరింద‌ని ఆయ‌న అన్నారు. రామ్‌నాథ్ కోవింద్ ప్ర‌భుత్వ విజ‌యాల‌ను వివరిస్తుండగా, స‌భ్యులంతా బ‌ల్ల‌లు చ‌రుస్తూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

More Telugu News