Telugudesam: భూ వివాదం.. ఎమ్మెల్యే బోండా ఉమా భార్యపై కేసు నమోదు

  • స్వాతంత్ర్య సమరయోధుల భూమిని తప్పుడు పత్రాలతో ఎమ్మెల్యే అనుచరులు తనఖా రిజిస్ట్రేషన్
  • బాధితుల ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారుల దర్యాప్తు
  • ఉమా భార్య సుజాత సహా 8 మందిపై పోలీసు కేసు నమోదు

భూ వివాదం కేసులో విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా భార్య సుజాతపై పోలీసు కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో ఆమెతో పాటు మరో 8 మందిపై  కేసు నమోదు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల భూమిని తప్పుడు పత్రాలతో ఎమ్మెల్యే అనుచరులు తనఖా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో సదరు బాధితులు సీఐడిని ఆశ్రయించారు.

దీనిపై దర్యాప్తు జరిపిన సీఐడీ అధికారులు.. సుజాతతో పాటు మరో 8 మందిపై కేసు నమోదు చేశారు. కాగా, గతంలో విజయవాడ నగరంలో ఓ భూ ఆక్రమణకు సంబంధించిన వ్యవహారంలో బోండా ఉమా ఆరోపణలు ఎదుర్కొన్నారు. తాజాగా, మరో వ్యవహారంలో ఆయన భార్యపై కేసు నమోదు కావడం గమనార్హం.

More Telugu News