Saina Nehwal: ఇండోనేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ: సెమీఫైనల్లోనూ విజయ దుందుభి మోగించిన సైనా నెహ్వాల్

  • నిన్న‌ జరిగిన క్వార్టర్స్‌లో పీవీ సింధుని ఓడించిన సైనా
  • సెమీ ఫైనల్‌లోనూ అదే దూకుడు
  • థాయ్‌లాండ్ క్రీడాకారిణి ఇంతనోన్‌ రచనోక్‌పై విజయం
  • 21-19, 21-19తో గెలిచిన హైదరాబాదీ

భారత బ్యాడ్మింట‌న్ స్టార్‌ క్రీడాకారిణి, హైద‌రాబాదీ సైనా నెహ్వాల్‌ ఇండోనేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో అద‌ర‌గొట్టేస్తోంది. నిన్న‌ జరిగిన క్వార్టర్స్‌లో పీవీ సింధుని ఓడించి సైనా సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ రోజు సెమీఫైనల్లో థాయ్‌లాండ్ క్రీడాకారిణి ఇంతనోన్‌ రచనోక్‌పై సైనా విజ‌య దుందుభి మోగించింది. ఆద్యంతం నువ్వా? నేనా? అన్న‌ట్లు జ‌రిగిన ఈ పోటీలో సైనా 21-19, 21-19 తో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. సైనా నెహ్వాల్ ఇదే దూకుడుని కొన‌సాగిస్తే ఫైన‌ల్లోనూ గెల‌వ‌డం ఖాయ‌మ‌ని క్రీడా విశ్లేష‌కులు అంటున్నారు. 

More Telugu News