sairaat: తొలి సినిమా పూర్తికాక‌ముందే రెండో సినిమా ఛాన్స్ కొట్టేసిన శ్రీదేవి కూతురు?

  • 'టెంప‌ర్' హిందీ రీమేక్‌లో ఛాన్స్ 
  • అవ‌కాశం ఇచ్చే యోచ‌న‌లో ఉన్న నిర్మాత‌లు
  • ర‌ణ్‌వీర్ సింగ్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం

తొలి సినిమా ఇంకా పూర్తికాక‌ముందే న‌టి శ్రీదేవి కూతురు జాహ్న‌వికి అవ‌కాశాలు వెల్లువ‌లా వ‌స్తున్నాయి. ఇటీవ‌ల తెలుగు చిత్రం 'టెంప‌ర్‌'కి రీమేక్‌గా హిందీలో రానున్న 'సింబా' చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవ‌కాశం ఆమెకు వ‌చ్చిన‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక స్ప‌ష్ట‌త రాలేదు. 'సింబా' చిత్రానికి రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, హీరోగా ర‌ణ్‌వీర్ సింగ్ న‌టిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఆమె న‌టిస్తున్న 'ద‌ఢ‌క్' చిత్రం షూటింగ్ పూర్తికావొచ్చింది. సూపర్ హిట్ మరాఠి చిత్రం సైరాట్‌ కు రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. జులై 20న ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు నిర్మాత క‌ర‌ణ్ జొహార్ స‌న్నాహాలు చేస్తున్నాడు. ఇందులో షాహిద్ క‌పూర్ సోద‌రుడు ఇషాన్ ఖ‌ట్ట‌ర్ హీరోగా న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

More Telugu News