ilayaraja: ఇళయరాజా పద్మవిభూషణ్ కు, కులానికి లింక్.. మండిపడుతున్న అభిమానులు!

  • ఇళయరాజాకు పద్మవిభూషణ్ పై ఓ పత్రిక దారుణ కథనం
  • పద్మ అవార్డుల్లో కులం పాత్ర అనే విధంగా కథనం
  • మండిపడుతున్న అభిమానులు

తన మధుర సంగీతంతో ఎన్నో ఏళ్లుగా అభిమానులను మైమరపించిన సంగీత సామ్రాట్ ఇళయరాజాకు భారత ప్రభుత్వం 'పద్మవిభూషణ్' ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన అభిమానులు పులకించిపోయారు. విభేదాలను సైతం పక్కనపెట్టి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన స్పందనను వ్యక్తం చేశారు. 'ఇళయరాజాను వరించి పద్మవిభూషణ్ గుర్తింపు పొందింది' అంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

ఇలాంటి తరుణంలో ఓ పత్రిక రాసిన ఓ కథనం ఆయన అభిమానులను ఆవేదనకు గురి చేస్తోంది. 'దళిత్ ఔట్ రీచ్ విత్ ఇళయరాజాస్ పద్మ' అంటూ ఆ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. పద్మ అవార్డుల్లో కులం పాత్ర అనే సారాంశంతో ఆ కథనం ఉంది. దీనిపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. రాజా ప్రతిభను కులంతో ముడిపెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కులాన్ని చూసే రాజాను భారత ప్రభుత్వం సత్కరించిందా? అంటూ మండిపడుతున్నారు.

More Telugu News