live: లైవ్ చ‌ర్చ‌లో న్యూస్ యాంక‌ర్‌ని 'బేబీ' అని పిలిచిన కర్ణిసేన నేత‌.. వీడియో చూడండి!

  • మ‌హిళకు గౌర‌వం ఇవ్వ‌లేని వారు ప‌ద్మావ‌తి గౌర‌వాన్ని ఎలా కాపాడుతారంటూ చ‌ర్చ‌
  • లైవ్ నుంచి 'నోర్మూయ్' అంటూ వెళ్లి పోయిన కర్ణి సేన నేత 
  • మ‌హిళా క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేసిన యాంక‌ర్ సంజ‌న చౌహాన్‌

'ప‌ద్మావ‌త్' చిత్రం విడుద‌లైనందుకు కర్ణి సేన‌లు విధ్వంసానికి పాల్పడిన సంగ‌తి తెలిసిందే. దీని గురించి వివిధ న్యూస్ ఛాన‌ళ్లు వారితో చ‌ర్చ‌లు కూడా నిర్వ‌హించాయి. అలాగే 'న్యూస్ ఎక్స్' ఛాన‌ల్ కూడా కర్ణి సేన మ‌ద్ద‌తుదారు సూర‌జ్‌పుల్ అముతో లైవ్ చ‌ర్చ నిర్వ‌హించింది. గ‌తంలో దీపికా ప‌దుకునే ముక్కు కోయాలంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన సూర‌జ్‌.. ఈ లైవ్ డిబేట్‌లో నోరు జారి మ‌రోసారి అభాసు పాల‌య్యారు.

లైవ్‌లో ఆయ‌న‌తో మాట్లాడుతున్న న్యూస్ యాంక‌ర్ సంజ‌న చౌహాన్‌ను ఆయ‌న మూడు సార్లు 'బేబీ బేబీ' అంటూ సంబోధించారు. దీంతో ఒక్క‌సారిగా ఇబ్బందికి గురైన సంజ‌నా, సూర‌జ్ మీద విరుచుకుప‌డింది. ఒక మ‌హిళ‌తో ఎలా మాట్లాడాలో తెలియ‌ని కర్ణి సేన‌లు ఓ క‌ల్పిత పాత్ర గౌర‌వం కోసం దేశ ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెడుతుండ‌టం హాస్యాస్ప‌దంగా ఉందంటూ, గౌర‌వం కాపాడ‌టంలో ఇదెక్క‌డి సూత్ర‌మ‌ని ఆమె ప్ర‌శ్నించింది. దీనికి స‌మాధానం చెప్ప‌డానికి త‌డ‌బ‌డిన సూర‌జ్, ఆమెను 'నోర్మూయ్' అంటూ లైవ్ నుంచి వెళ్లిపోయాడు.

త‌న‌ను అగౌరవంగా సంబోధించినందుకు సూర‌జ్ క్ష‌మాప‌ణ‌లు తెలియజేయాల‌ని సంజ‌న డిమాండ్ చేసింది. ఈ విష‌య‌మై జాతీయ మ‌హిళా క‌మిష‌న్‌కి ఆమె ఫిర్యాదు కూడా చేసింది. మ‌హిళా క‌మిష‌న్ వారు సూర‌జ్‌ని పిలిపించి చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. లైవ్ డిబేట్‌కి సంబంధించిన వీడియో చూసిన‌వారంతా సంజ‌నకు మ‌ద్ద‌తుగా, సూర‌జ్‌కి వ్య‌తిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు.

More Telugu News