Telangana: ‘గవర్నర్ ఎట్ హోమ్’ను బహిష్కరిస్తామన్న టీ-కాంగ్రెస్ నేతలు

  • రాజ్ భవన్ లో ఈ రోజు సాయంత్రం ‘గవర్నర్ ఎట్ హోమ్’
  • కేసీఆర్, హరీశ్ రావుపై ఇటీవల ప్రశంసలు కురిపించిన గవర్నర్
  • ఈ విషయమై గవర్నర్ పై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నేతలు

‘గవర్నర్ ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని టీ-కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో ఈ రోజు సాయంత్రం జరిగే ‘గవర్నర్ ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని కాంగ్రెస్ నేతలు అన్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టును ఇటీవల సందర్శించిన గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ పనితీరు, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ విషయమై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ గవర్నర్ పై విమర్శలు గుప్పించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ‘గవర్నర్ ఎట్ హోమ్’కు హాజరు కాకూడదని కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నట్టు సమాచారం.

More Telugu News