samsung: గ‌తేడాది ఎక్కువ‌గా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్... షియోమీ రెడ్‌మీ నోట్ 4

  • రీసెర్చీ సంస్థ కౌంట‌ర్‌పాయింట్ నివేదిక‌లో వెల్ల‌డి
  • టాప్ 10లో మూడు షియోమీ స్మార్ట్‌ఫోన్లు
  • నాలుగు శాంసంగ్, రెండు వీవో, ఒక ఒప్పో స్మార్ట్‌ఫోన్‌

ప్ర‌ముఖ మార్కెట్ రీసెర్చీ సంస్థ కౌంట‌ర్‌పాయింట్ ప్ర‌చురించిన నివేదిక ప్ర‌కారం గ‌తేడాది ఎక్కువ‌గా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా షియోమీ రెడ్‌మీ నోట్ 4 నిలిచింది. టాప్ 10 స్మార్ట్‌ఫోన్ల‌లో మూడు స్థానాల్లో షియోమీ ఫోన్లే నిలిచాయి. షియోమీ వారి రెడ్‌మీ 4 రెండోస్థానంలో ఉండ‌గా, రెడ్‌మీ 4ఏ ఐదో స్థానంలో నిలిచింది. ఇక భార‌తీయుల హాట్ ఫేవ‌రెట్ శాంసంగ్ కంపెనీ వారి స్మార్ట్‌ఫోన్లు ఈ టాప్ 10 జాబితాలో నాలుగు స్థానాలు ద‌క్కించుకున్నాయి.

గెలాక్సీ జే2 మూడో స్థానం, గెలాక్సీ జే7 నెక్స్ట్ ఆరో స్థానం, గెలాక్సీ జే7 ప్రైమ్ ఏడో స్థానం, గెలాక్సీ జే2 2016 ఎనిమిదో స్థానంలో నిలిచాయి. ఇక ఒప్పో ఏ37 నాలుగో స్థానంలో ఉండ‌గా, వీవో వారి వై55ఎల్‌, వై53 స్మార్ట్‌ఫోన్లు తొమ్మిది, ప‌ది స్థానాల్లో ఉన్న‌ట్లు కౌంట‌ర్‌పాయింట్ పేర్కొంది. మ‌రోవైపు గ‌తేడాది నాలుగో త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ల అమ్మ‌కాల్లో షియోమీ సంస్థ‌, శాంసంగ్‌ను అధిగ‌మించిన సంగ‌తి తెలిసిందే.

More Telugu News