raviteja: పాతబస్తీ నేపథ్యంలో కొనసాగే 'టచ్ చేసి చూడు'

  • రవితేజ తాజా చిత్రంగా 'టచ్ చేసి చూడు'
  • పాతబస్తీ రాజకీయాలే నేపథ్యం 
  • రవితేజకు అచ్చొచ్చిన పోలీస్ పాత్ర

రవితేజ కథానాయకుడిగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో 'టచ్ చేసి చూడు' సినిమా తెరకెక్కింది. రాశి ఖన్నా .. శీరత్ కపూర్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, వచ్చేనెల 2వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు.

ఓల్డ్ సిటీ నేపథ్యంలో ఈ కథ కొనసాగనున్నట్టు తెలుస్తోంది. ఓ పోలీస్ ఆఫీసర్ అయిన కథానాయకుడు, ఓల్డ్ సిటీలోని రాజకీయ నాయకులతో తలపడతాడట. పర్యవసానంగా చోటుచేసుకునే సన్నివేశాలతో ఈ సినిమా ఉత్కంఠభరితంగా కొనసాగుతుందని అంటున్నారు. గతంలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమాలు భారీ విజయాలను సాధించాయి. ఈ సినిమా కూడా ఘన విజయాన్ని అందుకోవడం ఖాయమనేది రవితేజ అభిమానుల మాట.      

More Telugu News