Sridevi: శ్రీదేవి లేటెస్ట్ ఫోటోలు చూసి... అభిమానుల షాక్!

  • అనురాగ్ బసు ఇంట్లో సరస్వతీ పూజ
  • ముఖం, బుగ్గలు ఉబ్బిపోయి కనిపించిన శ్రీదేవి
  • మరో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని అనుమానం

ఇటీవల బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ బసు ఇంట్లో సరస్వతీ పూజ జరుగగా, అతిథిగా వచ్చిన శ్రీదేవిని చూసి అక్కడి మీడియా ఫోటోగ్రాఫర్లు, అభిమానులు షాక్ తిన్నారట. అనురాగ్ ఇంటి ముందు ఆమె దిగగానే, ఆమె ముఖం, బుగ్గలు బాగా ఉబ్బిపోయి ఉన్నాయి. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా శ్రీదేవి ఉంది. దీంతో ఆమె మరోసారి ప్లాస్టిక్ సర్జరీ ఏమైనా చేయించుకుందా? అని ప్రతి ఒక్కరిలోనూ చర్చ మొదలైంది. అదే విషయమై శ్రీదేవిని వెంటనే ప్రశ్నించగా, ఆమె మాత్రం సమాధానం చెప్పకుండా వెళ్లిపోయింది.

ఇప్పుడు శ్రీదేవి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారగా, ఆమె ఇంకో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టే కనిపిస్తోందని అభిమానులు అంటున్నారు. గతంలో 'ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రం కోసం ఆమె సర్జరీ చేయించుకున్నట్టు వార్తలు రాగా, శ్రీదేవి వాటిని ఖండించిన సంగతి తెలిసిందే. తన ఆహారపు అలవాట్లు, పవర్ యోగ కారణంగా శరీరంలో మార్పులు వస్తుంటాయని ఆమె చెప్పినా, ఆ విషయాన్ని అభిమానులు నమ్మడం లేదు. శ్రీదేవి తాజా చిత్రాన్ని మీరూ చూడవచ్చు.

More Telugu News