school: రాజ్‌పుత్ క‌ర్ణిసేనల ఎటాక్: ప్రాణభయంతో బస్సులో సీట్ల పక్కన దాక్కున్న విద్యార్థులు.. వీడియో చూడండి!

  • గుర్గావ్‌లో ఘటన
  • 'పద్మావత్' విడుదల నేపథ్యంలో రాజ్‌పుత్‌ల ఆందోళన
  • స్కూల్ బస్‌పై దాడి 

దేశ రాజ‌ధాని ఢిల్లీకి ద‌గ్గ‌ర‌లోని గుర్గావ్‌లో స్కూల్ చిన్నారులకు భ‌యాన‌క అనుభ‌వం ఎదురైంది. బాలీవుడ్ సినిమా ప‌ద్మావ‌త్ ఎన్నో వివాదాలను ఎదుర్కుని చివ‌ర‌కు రేపు విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాజ్‌పుత్ క‌ర్ణిసేనల ఆందోళ‌న‌లు మిన్నంటుతున్నాయి. గుర్గావ్‌లో ఓ స్కూలు బ‌స్ వెళుతుండ‌గా దానిపై ఆందోళ‌నకారులు దాడి చేశారు. బ‌స్సు అద్దాల‌న్నీ ప‌గిలిపోయాయి. దీంతో చిన్నారులు అంద‌రూ బ‌స్సు సీట్ల కింద దాక్కుని ప్రాణ భ‌యంతో వ‌ణికిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.     

More Telugu News