MMTS: హైద‌రాబాద్‌లో విషాదం.. రైల్వే ట్రాక్ ప‌క్క‌కు నిల‌బ‌డి సెల్ఫీ.. రైలు ఢీ.. వీడియో వైర‌ల్‌!

  • భ‌ర‌త్ న‌గ‌ర్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో ఘటన
  • సెల్ఫీ వీడియో కోసం ప్రయత్నించి గాయాలపాలైన యువకుడు
  • కుడి చేతికి, త‌ల‌కి గాయాలు

హైదరాబాద్‌లోని భ‌ర‌త్ న‌గ‌ర్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో ఓ యువ‌కుడు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నాడు. రైల్వే ట్రాక్ వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ శివ అనే యువకుడు త‌న సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకోవాల‌ని అనుకున్నాడు. త‌న‌ వెన‌క నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్ వ‌స్తుండ‌గా దాన్ని ఓ చేతితో చూపిస్తూ పోజులిచ్చాడు. ఆ ట్రైన్ అత‌డి కుడి చేతికి, త‌ల‌కి బ‌లంగా తాకింది. గాయ‌ప‌డ్డ‌ ఆ యువ‌కుడిని గుర్తించిన రైల్వే సిబ్బంది ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అత‌డి ప్రాణాల‌కు ప్ర‌మాదం ఏమీ లేద‌ని వైద్యులు చెప్పారు. సాధార‌ణంగా సెల్ఫీ వీడియోలో చూస్తోంటే ఆ ట్రైన్ కాస్త దూరంగా ఉన్న‌ట్లు క‌న‌ప‌డుతుంది. 

More Telugu News