kashmir: రైల్వే ట్రాక్ మీద కాశ్మీర్ వ్య‌క్తి ప్రాణాంత‌క విన్యాసం... వీడియో చూడండి!

  • మాజీ ముఖ్య‌మంత్రికి ఫిర్యాదు చేసిన నెటిజ‌న్లు
  • మూర్ఖ‌త్వంగా వ్య‌వ‌హరించాడంటూ కామెంట్ చేసిన మాజీ సీఎం
  • ఇలాంటివి ట్రెండ్ కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నెటిజ‌న్ల విజ్ఞ‌ప్తి

కాశ్మీర్‌కి చెందిన ఓ కుర్రాడు చేసిన ప్రాణాంత‌క విన్యాసం వీడియో ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో ఎప్పుడు రికార్డు చేశారో తెలియ‌దు కానీ, నిన్న సాయంత్రం ఇది సోష‌ల్ మీడియాలో ప్రత్య‌క్ష‌మైంది. కాశ్మీరీ సంప్ర‌దాయ కుర్తా ధ‌రించిన ఓ వ్య‌క్తి రైల్వే ట్రాక్ మ‌ధ్య‌లో ప‌డుకోవ‌డం, త‌ర్వాత అత‌ని మీదుగా రైలు వెళ్ల‌డం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను చూసిన‌వారంద‌రూ చాలా అస‌హ‌నానికి గురై జ‌మ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఒమ‌ర్ అబ్దుల్లాకు ఫిర్యాదు చేశారు.

ఈ వీడియోపై ఆయ‌న స్పందిస్తూ... 'సాహ‌సాలు చేయ‌డం కోసం మ‌రీ ఈ స్థాయికి దిగ‌జార‌డం నిజంగా మూర్ఖ‌త్వం' అని అర్థం వ‌చ్చేలా ట్వీట్ చేశారు. ఈ వీడియో ట్రెండింగ్‌గా మారి అంద‌రూ అనుక‌రించ‌క ముందే ఆ వీడియోలో ఉన్న వ్య‌క్తిపై, తీసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లువురు నెటిజ‌న్లు ఒమ‌ర్ అబ్దుల్లాను కోరారు.

More Telugu News