doctors nurses playing cards: ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సుల పేకాట!

  • భారీ సంఖ్యలో రోగులు
  • పేకాటలో మునిగిన సిబ్బంది
  • సీసీటీవీలో రికార్డు

రోగులను పట్టించుకోకుండా, ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు కలసి పేకాడుతూ పట్టుబడిన ఘటన కర్ణాటకలో కలకలం రేపుతోంది. విజయపుర ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన వెలుగుచూసింది. వైద్యం కోసం పెద్ద సంఖ్యలో రోగులు వచ్చారు. అయితే, వీరికి వైద్యం అందించాల్సిన డాక్టర్లు, నర్సులు మాత్రం పేకాటలో మునిగిపోయారు. ఈ వ్యవహారం సీసీటీవీ ఫుటేజీలో వెలుగుచూసింది. ఈ ఘటనపై వైద్య శాఖ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేకాట ఆడినవారిపై దర్యాప్తుకు ఆదేశించారు.

More Telugu News