akhilesh yadav: పార్ల‌మెంట్ స‌భ్యుడిగా పోటీ చేయ‌నున్న అఖిలేశ్ యాద‌వ్‌

  • క‌న్నౌజ్ స్థానం నుంచి బ‌రిలోకి
  • స్వ‌యంగా వెల్ల‌డించిన మాజీ ముఖ్య‌మంత్రి
  • ప్ర‌స్తుతం అదే స్థానం నుంచి ఎంపీగా ఉన్న భార్య డింపుల్‌

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న పార్లమెంట్ ఎన్నిక‌ల్లో తాను పోటీచేయ‌నున్న‌ట్లు ఉత్త‌ర ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేశ్ యాద‌వ్ ప్ర‌క‌టించారు. క‌న్నౌజ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తాను ఎంపీగా పోటీ చేస్తాన‌ని అఖిలేశ్ వెల్ల‌డించారు. ప్రస్తుతం అదే స్థానం నుంచి ఆయ‌న భార్య డింపుల్ యాద‌వ్ ఎంపీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. సోష‌లిస్టు నేత జ‌నేశ్వ‌ర్ మిశ్రా వ‌ర్థంతి ఉత్స‌వాల్లో పాల్గొన్న అఖిలేశ్ వ‌చ్చే ఏడాది కార్యాచ‌ర‌ణ గురించి కొన్ని ముఖ్య‌విష‌యాల‌ను వెల్ల‌డించారు. తనతో పాటు ములాయం సింగ్ కూడా మెయిన్‌పురి నుంచి ఎంపీగా పోటీ చేస్తార‌ని అఖిలేశ్ తెలిపారు.

More Telugu News