Pawan Kalyan: జనసేన అధిపతికి విజయీభవ : పరుచూరి గోపాలకృష్ణ

  • పవన్ కల్యాణ్  ప్రజాయాత్ర ప్రభంజన యాత్రగా మారాలి
  • ప్రజలకు హితం జరగాలి
  • పవన్ కు శుభాకాంక్షలు: ఓ ట్వీట్ లో పరుచూరి

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిరంతర ప్రజా యాత్ర (చలోరే చలోరే చల్) ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు అంతా శుభం జరగాలని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ  కోరుకున్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ‘తరం తరం నిరంతరం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటున్న జనం సమస్యలను తెలుసుకోడానికి పవన్ కల్యాణ్ ప్రారంభించిన ప్రజాయాత్ర ప్రభంజనయాత్రగా మారి, ప్రజలకు హితం జరగాలని కోరుకుంటున్నా.. జనసేనానికి శుభాకాంక్షలు.. విజయీభవ’ అని పరుచూరి కోరుకున్నారు.

More Telugu News