women: అపార్ట్‌మెంట్‌ ఐదో అంత‌స్తు నుంచి కూతురితో పాటు దూకి మ‌హిళ ఆత్మ‌హ‌త్య

  • హైద‌రాబాద్ శివారు చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఘటన
  • మృతులు త‌ల్లి స్వాతి (35), కూతురు శాన్వి (01) గుర్తింపు
  • దర్యాప్తు చేస్తోన్న పోలీసులు

హైద‌రాబాద్ శివారు చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. తన కూతురితో కలిసి ఓ మహిళ అపార్ట్‌మెంట్‌ ఐదో అంత‌స్తు నుంచి కిందకి దూకింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతులు త‌ల్లి స్వాతి (35), కూతురు శాన్వి (01) గా గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగానే స్వాతి ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్వాతి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.

More Telugu News