roja: మణికొండలోని ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ

  • మణింకొండలోని నివాసంలో చోరీ
  • బంగారు, వజ్రాల నగల అపహరణ
  • వీటి విలువ రూ. 10 లక్షలు

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఉంచిన బంగారు, వజ్రాల నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ. 10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. హైదరాబాద్ మణికొండలోని పంచవటి కాలనీలో రోజా నివాసం ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా ఇంటికి తాళం వేసి ఉంది. దీన్ని గమనించిన దొంగలు, పక్కా ప్రణాళికతో చోరీకి పాల్పడ్డారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

More Telugu News