Ramcharan: సుకుమార్ ఒళ్లో చెర్రీ... మెగా అభిమానులను ఫిదా చేస్తున్న పిక్ ఇది!

  • సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం'
  • రెండు రోజుల్లో విడుదల కానున్న టీజర్
  • మార్చి 30న విడుదలకు సిద్ధం

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'రంగస్థలం' టీజర్ జనవరి 24న విడుదల కానుండగా, ఇప్పుడు బయటకు వచ్చిన ఓ పిక్ మెగా అభిమానులను ఫిదా చేస్తోంది. ఓ కుర్చీలో సుకుమార్ కూర్చుని ఉండగా, చెర్రీ ఆయన ఒళ్లో కూర్చున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లో చిరంజీవి పెద్ద చిత్రం ఒకటి కనిపిస్తోంది. సినిమాకు సంబంధించిన చిత్రం కాకపోయినా, దీన్ని మెగా ఫ్యామిలీ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. కాగా, మార్చి 30న 'రంగస్థలం' ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

More Telugu News