vivekananda: వివేకానంద‌, నేతాజీల‌ జ‌యంతులను జాతీయ సెల‌వులుగా ప్ర‌క‌టించాలి: మ‌మ‌తా బెన‌ర్జీ

  • ప్ర‌ధాని మోదీకి లేఖ రాసిన ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి
  • జ‌న‌వ‌రి 12, 23 తేదీల్లో వివేకానంద‌, నేతాజీల జ‌యంతి
  • ట్వీట్ ద్వారా వెల్ల‌డించిన మ‌మ‌తా బెన‌ర్జీ

స్వామి వివేకానంద‌, నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్‌ల జ‌యంతి రోజులైన జ‌న‌వ‌రి 12, 23 తేదీల‌ను జాతీయ సెల‌వు దినాలుగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తూ ప‌శ్చిమబెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ విష‌యాన్ని ఆమె త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. దేశ విదేశాల్లో భార‌త ఖ్యాతిని నిల‌బెట్టిన ఇరు నాయ‌కుల పుట్టిన రోజుల‌ను జాతీయ సెల‌వుదినాలుగా ప్ర‌క‌టించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని ఆమె అన్నారు.

More Telugu News