air india: ఎయిరిండియా విమానాన్ని ఢీ కొన్న ప‌క్షి.. మ‌ణిపూర్ సీఎం స‌హా 160 మందికి త‌ప్పిన ప్ర‌మాదం

  • గువహటి ఎయిర్‌పోర్టులో ఘటన
  • విమానంలోని ముందు భాగం డ్యామేజ్‌
  • చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్ చేసిన పైలట్
  • ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదని ప్రకటన

మ‌ణిపూర్ ముఖ్య‌మంత్రి ఎన్.బిరేన్ సింగ్ పెను ప్ర‌మాదం నుంచి తప్పించుకున్నారు. గువహటిలోని లోక్‌ప్రియ గోపినాథ్ బోర్డోలోయి ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానం ల్యాండ్ అవుతుండ‌గా దానిని ఓ పక్షి ఢీకొంది. దీంతో విమానంలోని ముందు భాగం కొంత పాడైపోయినప్పటికీ పైలట్ చాకచక్యంతో విమానాన్ని ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానంలో మణిపూర్ సీఎం సహా 160 మంది ప్రయాణికులు ఉన్నారని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదని ప్రకటించారు.

More Telugu News