jhanvi: శ్రీదేవీ కూతురు జాహ్నవి తొలి సినిమా విడుద‌ల‌ డేట్ ఖరారు!

  • జులై 20న విడుద‌లకానున్న ధ‌డ‌క్‌
  • ట్వీట్‌లో వెల్ల‌డించిన నిర్మాత క‌ర‌ణ్ జొహార్‌
  • ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన శ‌శాంక్ ఖైతాన్‌

అతిలోక సుంద‌రి శ్రీదేవీ పెద్ద కూతురు జాహ్న‌వి తొలి సినిమా విడుద‌ల‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరాఠీలో హిట్టైన 'సైరత్' చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కుతున్న‌ 'ధ‌డ‌క్' చిత్రంలో ఆమె హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని జులై 20న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర నిర్మాత క‌ర‌ణ్ జొహార్ ట్వీట్‌లో వెల్లడించారు. ట్వీట్‌తో పాటు ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్ట‌ర్‌ను కూడా ఆయ‌న విడుద‌ల చేశారు.

అగ్ర‌కులానికి చెందిన అమ్మాయి, నిమ్న కులానికి చెందిన అబ్బాయిల మ‌ధ్య క‌లిగిన ప్రేమ‌, దాని ప‌రిణామాలు క‌థాంశంగా ఈ చిత్రం తెర‌కెక్కింది. శ‌శాంక్ ఖైతాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు షాహిద్ క‌పూర్ స‌వ‌తి సోద‌రుడు ఇషాన్ ఖ‌ట్ట‌ర్ హీరోగా న‌టిస్తున్నాడు. దీని మరాఠీ మాతృక 'సైరత్' ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 120 కోట్లు వ‌సూలు చేసిన సంగ‌తి తెలిసిందే.

More Telugu News