manchu vishnu: 'ఆచారి అమెరికా యాత్ర' ట్రైలర్ రిలీజ్

  • విష్ణు తాజా చిత్రంగా 'ఆచారి అమెరికా యాత్ర'
  • యాక్షన్ కామెడీయే ప్రధాన ఇతివృత్తం 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు  

మంచు విష్ణు కథానాయకుడిగా జి. నాగేశ్వర రెడ్డి 'ఆచారి అమెరికా యాత్ర' సినిమాను తెరకెక్కించాడు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, బ్రహ్మానందం కీలకమైన పాత్రను పోషించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు. పౌరోహిత్యం చేసే గురు శిష్యులుగా ఈ ట్రైలర్ లో బ్రహ్మానందం .. విష్ణు కనిపిస్తున్నారు.

 ఏదో హోమం చేయడానికి ఈ గురు శిష్యులు అమెరికా వెళతారు. అక్కడ వాళ్లకి ఎదురయ్యే సంఘటనలతో ఈ కథ కొనసాగనున్నట్టు తెలుస్తోంది. యాక్షన్ కామెడీకి ప్రాధాన్యతనిస్తూ .. ప్రధాన పాత్రలపై కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. విష్ణు ఫైట్స్ .. ప్రగ్యా జైస్వాల్ తో రొమాంటిక్ సీన్స్ .. బ్రహ్మీ కామెడీ ఈ ట్రైలర్ కి హైలైట్స్ గా నిలుస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు  

More Telugu News