nitish kumar: జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కిందకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్

  • నితీష్ కుమార్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ
  • ఇటీవలే నితీష్ కాన్వాయ్ పై దాడి
  • భద్రతను పెంచిన కేంద్రం

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన, ఇంటెలిజెన్స్ బ్యూరో చేసిన సెక్యూరిటీ ఆడిట్ అనంతరం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ భద్రత కింద నితీష్ కు 35 నుంచి 40 మంది సాయుధ కమెండోలు రక్షణ కల్పిస్తారు. ఎప్పుడూ ఎస్కార్ట్ వాహనాలు ఉంటాయి. ఇటీవల నితీష్ ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు ఆయన కాన్వాయ్ పై దాడి జరిగింది. దీంతో, ఆయనకు భద్రత పెంచాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీతో కేంద్ర హోం శాఖ సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ స్థాయి భద్రతను కల్పిస్తున్న వారి జాబితాలో నితీష్ ను చేర్చారు.

More Telugu News