Telangana: ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కుమారుడి కారు బోల్తా.. తప్పిన ప్రమాదం

  • ప్రశాంత్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం
  • కారులో ఎమ్మెల్యే సతీమణి పుష్పలత
  • బెలూన్లు తెరుచుకోవడంతో తప్పిన పెను ప్రమాదం

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కుమారుడు ప్రశాంత్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారు లోపలి బెలూన్లు సకాలంలో తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం సాయంత్రం సుల్తానాబాద్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రశాంత్‌రెడ్డి కారులో కరీంనగర్ నుంచి పెద్దపల్లికి వెళ్తుండగా సుల్తానాబాద్ సమీపంలోని సెయింట్ మేరీ పాఠశాల సమీపంలోని మలుపు వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఆ సమయంలో కారులో ఎమ్మెల్యే భార్య పుష్పలత ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని సేఫ్టీ బెలూన్లు తెరుచుకోవడంతో  స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

More Telugu News