raviteja: వక్కంతం వంశీ అందించిన కథనే 'టచ్ చేసి చూడు'

  • రవితేజ హీరోగా 'టచ్ చేసి చూడు'
  • కథానాయికలుగా రాశి ఖన్నా .. శీరత్ కపూర్ 
  • వచ్చేనెల 2వ తేదీన విడుదల   

విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రవితేజ హీరోగా 'టచ్ చేసి చూడు' సినిమా తెరకెక్కింది. రాశిఖన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాను, వచ్చేనెల 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విక్రమ్ సిరికొండ మాట్లాడుతూ .. చాలాకాలం నుంచి స్క్రిప్ట్ విభాగంలో పనిచేస్తూ వస్తోన్న తనకి, ఈ సినిమాతో దర్శకుడిగా అవకాశం లభించిందని అన్నారు.

 ఈ సినిమాకి వక్కంతం వంశీ కథను అందించాడు .. ఆ కథను వినిపించగానే రవితేజ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పారు. రాశిఖన్నా .. శీరత్ కపూర్ గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. ప్రీతమ్ సంగీతం యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పారు. ఈ సినిమా తమకి తప్పకుండా హిట్ ను ఇస్తుందనే నమ్మకం ఉందని వ్యక్తం చేశారు.  

More Telugu News