gold: కాస్త తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి ధర

  • నిన్న‌ రూ.150 తగ్గిన బంగారం ధర
  • ఈ రోజు రూ.120 తగ్గి రూ.30,830గా న‌మోదైన పది గ్రాముల పసిడి ధర
  • రూ.50 తగ్గి రూ.39,850గా న‌మోదైన కిలో వెండి ధర

అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం, ఆభరణాల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు త‌గ్గిపోవ‌డంతో ఈ రోజు బంగారం ధ‌ర కాస్త త‌గ్గింది. బులియ‌న్ మార్కెట్లో నిన్న‌ బంగారం ధర రూ.150 తగ్గగా, ఈ రోజు మ‌రో రూ.120లు తగ్గి పది గ్రాముల పసిడి ధర రూ.30,830గా న‌మోదైంది. మ‌రోవైపు ఈ రోజు వెండి ధ‌ర మాత్రం రూ.50 పెరిగి కిలో వెండి రూ.39,850గా న‌మోదైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు త‌గ్గిపోయాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇక గ్లోబ‌ల్ మార్కెట్లో ప‌సిడి ధ‌ర‌ 0.38 శాతం పెరిగి, ఔన్సు 1,331.40 డాలర్లు పలికింది.    

More Telugu News