raja singh: థియేటర్లు తగలబెడితే మీరే నష్టపోతారు.. 'పద్మావత్‌'పై రాజాసింగ్‌ ఫైర్‌

  • న్యాయస్థానానికి అసత్యాలు చెప్పారు
  • ఇటువంటి సినిమా తీసేవారికి సరైన సమాధానం ఇవ్వాలి
  • ఈ సినిమాను చూడొద్దు
  • వారు నష్టపోతే మరోసారి చరిత్రను వక్రీకరించి సినిమాలు తీయబోరు

ఈ నెల 25న విడుదలవుతోన్న 'పద్మావత్' సినిమాపై హైదరాబాద్‌లోని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ మండిపడ్డారు. పద్మావతి పేరును 'పద్మావత్‌'గా మార్చేసి, అసలు ఈ సినిమా వల్ల ఎటువంటి సమస్య ఉండదని, కొంత మంది కావాలనే వివాదాన్ని రేపుతున్నారని ఆ సినిమా బృందం న్యాయస్థానానికి తప్పుడు పత్రాలు ఇచ్చిందని రాజాసింగ్ ఆరోపించారు.

ఇటువంటి సినిమాలు తీసేవారికి సరైన సమాధానం ఇవ్వాలంటే మనం ఈ సినిమాను చూడొద్దని, వారు నష్టపోతే మరోసారి చరిత్రను వక్రీకరించి సినిమాలు తీయబోరని అన్నారు. థియేటర్లు తగలబెడితే మీరే నష్టపోతారని తాము ఇప్పటికే పలువురికి చెప్పామని వ్యాఖ్యానించారు.

More Telugu News