suriya: ఒకే వేదిక మీద నాలుగు సినిమా వేడుక‌లు నిర్వ‌హించిన నిర్మాత‌

  • అన్నింటికీ నిర్మాత ఆయ‌నే కావ‌డంతో సాధ్యం
  • అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన జ్ఞాన‌వేల్ రాజా
  • సూర్య చేతుల మీదుగా భాగ‌మ‌తి త‌మిళ పాట‌లు విడుద‌ల‌

ఒకే వేదిక మీద నాలుగు సినిమా వేడుక‌లు నిర్వ‌హించి ప్ర‌ముఖ నిర్మాత జ్ఞాన‌వేల్ రాజా అంద‌రినీ ఆశ్చ‌ర్యప‌రిచారు. ఈ నాలుగు సినిమాల‌కు ఆయ‌నే నిర్మాత కావ‌డంతో ఈ ఘ‌న‌త సాధ్యమైంది. సూర్య నటించిన ‘తానా సేరింద కూట్టం’ చిత్రం విజ‌యోత్స‌వ స‌భ‌ను, భాగ‌మ‌తి త‌మిళ పాటల వేడుక‌ను, ఆర్య న‌టించిన `గ‌జ‌నీకాంత్‌` సినిమా ప‌రిచ‌య కార్య‌క్ర‌మాన్ని, కార్తిక్‌ కుమారుడు గౌతం హీరోగా నటిస్తున్న ‘ఇరుట్టు అరైయిల్‌ మురట్టు కుత్తు’ సినిమా సింగిల్‌ట్రాక్‌ ఆవిష్కరణ వేడుక‌ను ఒకే వేదిక మీద జ్ఞాన‌వేల్ నిర్వ‌హించారు. చెన్నైలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మాల‌కు సూర్య‌, కీర్తిసురేష్‌, రమ్యకృష్ణ, అనుష్క‌, ఆర్య‌, శాయేషా తదితరులు హాజ‌ర‌య్యారు. సూర్య చేతుల మీదుగా భాగ‌మ‌తి పాట‌లు విడుద‌ల చేశారు.

More Telugu News