charan: మొత్తానికి కైరా అద్వానీకే ఛాన్స్ దక్కింది!

  • సెట్స్ పై 'భరత్ అనే నేను' 
  • కథానాయికగా కైరా అద్వాని 
  • ఈ రోజే మొదలైన చరణ్ సినిమా 
  • కైరా అద్వానినే ఎంపిక చేశారు    

చరణ్ హీరోగా బోయపాటి శ్రీను తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ రోజున మొదలైంది. ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వానీని ఖరారు చేశారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో కైరా అద్వాని కూడా పాల్గొంది. మొదటి నుంచి కూడా ఈ సినిమాలో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ పేరు వినిపిస్తూ వచ్చింది.

'అజ్ఞాతవాసి' హిట్ అయ్యుంటే .. చరణ్ సినిమాలో హీరోయిన్ ప్లేస్ అనూ ఇమ్మాన్యుయేల్ కే దక్కి ఉండేదట. ఆ సినిమా పరాజయంపాలు కావడం వల్లనే, చరణ్ మూవీలో అనూ ఛాన్స్ కోల్పోయిందని అంటున్నారు. ప్రస్తుతం మహేశ్ బాబుతో 'భరత్ అనే నేను' చేస్తోన్న కైరా అద్వానికి, తరువాత అవకాశమే చరణ్ సినిమాలో లభించడం ఆమె అదృష్టమనే అంటున్నారు. 

More Telugu News