Kakinada: కాకినాడ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు.. వివరాలు ఇవిగో!

  • పండుగ ప్రయాణికుల కోసం రేపు, ఎల్లుండి ప్రత్యేక రైళ్లు 
  • సద్వినియోగం చేసుకోవాలన్న రైల్వే
  • మరికొన్నింటిని ప్రకటిస్తామన్న అధికారులు

పండుగ ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ఈనెల 20, 21 తేదీల్లో కాకినాడ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు ప్రకటించింది. కాకినాడ టౌన్-సికింద్రాబాద్ స్పెషల్ (07002) రైలు కాకినాడ టౌన్ నుంచి రాత్రి 8:05 గంటలకు బయలుదేరి 21న ఉదయం 6:55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.  21న రాత్రి 9:15 గంటలకు కాకినాడ టౌన్-సికింద్రాబాద్ స్పెషల్ (07004) రైలు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి 22న ఉదయం 9:35 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. పండుగ కోసం ఊరెళ్లిన ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరికొన్ని ప్రత్యేక రైళ్లను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. 

More Telugu News