Kathi Mahesh: కత్తి మహేశ్ పై కోడిగుడ్లతో దాడి!

  • హైదరాబాద్ లో చోటుచేసుకున్న సంఘటన
  • ఓ ఛానెల్ లో చర్చా కార్యక్రమంలో పాల్గొని వెళుతుండగా దాడి
  • గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డట్టు సమాచారం

పవన్ ఫ్యాన్స్ పేరిట తనను కొందరు వేధింపుల పాలు చేస్తున్నారని, వారిపై త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఫిలిం క్రిటిక్ కత్తి మహేశ్ ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఈ సాయంకాలం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతుండగా ఈ దాడి జరిగింది. కొండాపూర్ లో కారు దిగిన ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.


More Telugu News