KTR: భారత్ కు రెండో రాజధాని హైదరాబాదే!: జర్నలిస్టు ట్వీట్ కు కేటీఆర్ స్పందన

  • భారత్ కు రెండు రాజధానులు ఉండాల్సిందని రాజ్ దీప్ ట్వీట్
  • ఆ ట్వీట్ కు స్పందించిన కేటీఆర్
  • 'అధికారికంగా ధ్రువీకరించబడలేదు కానీ రెండో రాజధాని హైదరాబాదే' అన్న కేటీఆర్

అధికారికంగా ధ్రువీకరించబడలేదు కానీ భారత్ కు రెండో రాజధాని హైదరాబాదే అంటూ ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ ట్వీట్ కు కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్ ను ఉద్దేశిస్తూ ‘ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఢిల్లీ కంటే హైదరాబాదే మెరుగైన రాజధాని లేదా రెండో రాజధాని అయి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. భారత్ కు రెండు రాజధానులు ఉండాల్సింది’ అని రాజ్ దీప్ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ కు కేటీఆర్ స్పందిస్తూ, ‘రాజ్ దీప్, దేశ రాజధాని ఢిల్లీ తర్వాత రాష్ట్రపతి నిలయం వున్నది హైదరాబాద్ లోనే. ఈ విషయాన్ని మీకు గుర్తుచేయాలని అనుకుంటున్నాను. ప్రతి ఏటా శీతాకాలంలో రాష్ట్రపతి నిలయంలో బస చేస్తుంటారు..’ అని పేర్కొన్నారు.

More Telugu News