mother: కన్న కొడుకునే చంపేసిన తల్లి.. ఆపై తమ కుమారుడు అదృశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు

  • కేరళలోని కొళ్లాం జిల్లా నెడుంబనలో దారుణ ఘ‌ట‌న
  • కొడుకు మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కాల్చేసిన వైనం
  • తల్లే చంపేసిందని తేల్చిన పోలీసులు
  • ఎందుకు చంపాననే విషయంపై నోరువిప్పని తల్లి

కేరళలోని కొళ్లాం జిల్లా నెడుంబనలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ మ‌హిళ త‌న కొడుకుని హ‌త్య చేసి, అత‌డి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి, కాల్చింది. నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. అయితే, క‌న్న కొడుకునే ఎందుకు హ‌త్య చేయ‌వ‌ల‌సి వ‌చ్చింద‌నే విష‌యంపై ఆమె నోరు విప్ప‌డం లేదు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే జితూ జాబ్ అనే 14 ఏళ్ల‌ త‌మ కుమారుడు సోమవారం రాత్రి అదృశ్యమయ్యాడని అత‌డి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి కోసం అన్వేషించగా, వాళ్లింటి సమీపంలోనే ఓ మృతదేహం ముక్కలు ముక్కలుగా పడి, కాలిపోయి ఉండటాన్ని గుర్తించారు. చివరికి ఆ మృతదేహం జితూదేన‌ని నిర్ధారించారు. తమకు శత్రువులెవరూ లేరని అత‌డి త‌ల్లిదండ్రులు చెప్పారు. దీంతో కుటుంబసభ్యులే ఈ హ‌త్య చేసి ఉండొచ్చ‌ని పోలీసులు భావించారు. ఈ క్ర‌మంలో తాజాగా జితూ కుటుంబాన్ని విచారిస్తూ ఆ బాలుడి తల్లి చేతికి కాలిన గాయాన్ని గుర్తించారు. దీంతో ఆమెపై అనుమానం వ్య‌క్తం చేసిన పోలీసులు విచారించ‌గా ఆమె నేరాన్ని ఒప్పుకుంది. అయితే, కొడుకుని ఎందుకు చంపాల్సి వచ్చిందన్న విషయాన్ని మాత్రం ఆమె చెప్పడం లేదు.    

More Telugu News