rajputh: ఇదే ఫైనల్ వార్నింగ్.. 'పద్మావత్‌' థియేటర్లను తగులబెడతాం అంతే!: రాజ్‌పుత్‌లు

  • వివాదాల న‌డుమ చిక్కుకుపోతోన్న 'పద్మావత్'
  • ఈ సినిమాను నిషేధించాల్సిందేనంటోన్న రాజ్‌పుత్‌లు
  • మరోసారి ఉత్కంఠ

ఎన్నో వివాదాల న‌డుమ చిక్కుకుపోయి చివ‌రకు విడుద‌ల‌కు సిద్ధ‌మైన బాలీవుడ్ సినిమా 'పద్మావత్‌'పై రాజ్‌పుత్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాను విడుదల చేస్తే ఊరుకోబోమని హెచ్చరించాయి. తమ విన్నతులను పట్టించుకోకుండా ఆ సినిమాను విడుదల చేస్తే థియేటర్లను తగులబెడతామని ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నామని ఆయా సంఘాల ప్రతినిధులు అన్నారు. ఈ సినిమాను నిషేధించాల్సిందేనని డిమాండ్ చేశారు.

రాణి పద్మావతి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తీశారని రాజ్‌పుత్‌లు ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను బీజేపీ పాలిత రాష్ట్రాలు కొన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించగా సుప్రీంకోర్టు మాత్రం ఈ సినిమా విడుదలకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ రాజ్‌పుత్‌లు ఆందోళనకు దిగుతామని హెచ్చరించడంతో మరోసారి ఉత్కంఠ నెలకొంది.

More Telugu News