Supreme Court: ఆ నలుగురు సీనియర్ న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భేటీ

  • ఉదయం కోర్టు ప్రారంభానికి ముందే చర్చలు
  • 15 నిమిషాల పాటు కొనసాగిన సమావేశం
  • బయటకు వెల్లడి కాని వివరాలు

సుప్రీంకోర్టు పరిపాలన సజావుగా లేదంటూ బహిరంగంగా ప్రకటించిన నలుగురు సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఈ రోజు ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. వారు లేవనెత్తిన అంశాల పరిష్కారానికి ఈ భేటీ జరిగింది. ఉదయం కోర్టు వ్యవహారాలు ప్రారంభమయ్యే సమయం 10.30 గంటలకు ముందే జరిగిన ఈ భేటీ 15 నిమిషాల పాటు కొనసాగింది. అయితే, సమావేశం ఫలితాలు మాత్రం బయటకు వెల్లడి కాలేదు. ఈ నెల 12న మీడియా ముందుకు వచ్చిన నలుగురు న్యాయమూర్తులు జస్టిస్ జే చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

More Telugu News