NTR: నేడు ఎన్టీఆర్ వర్ధంతి: నక్లెస్ రోడ్డుకు క్యూ కట్టిన బాలకృష్ణ, హరికృష్ణ, జూ. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్!

  • ఎన్టీఆర్ ఘాట్ కు కుటుంబ సభ్యులు  
  • పుష్పగుచ్ఛాలుంచి నివాళులు 
  • 'తెలుగుజాతి గుండె చప్పుడు ఎన్టీఆర్' అన్న బాలయ్య

నేడు మాజీ ముఖ్యమంత్రి, మహా నటుడు, దివంగత నందమూరి తారక రామారావు వర్థంతి కాగా, ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్దఎత్తున హైదరాబాద్ నక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ కు తరలివచ్చి నివాళులు అర్పించారు. సినీ నటుడు బాలకృష్ణ, ఆయన సోదరుడు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు ఘాట్ వద్ద పుష్పగుచ్ఛాలుంచి నివాళులు అర్పించారు.

 ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, తెలుగు జాతి గుండె చప్పుడు ఎన్టీఆర్ అని, తెలుగువారి అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడని, తెలుగు వెలుగును ప్రపంచ నలుమూలలా వ్యాపింపజేసిన వ్యక్తని కొనియాడారు. తెలుగు ప్రజలకు సేవచేయాలన్న సంకల్పంతోనే తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేసుకున్నారు.

More Telugu News