jharkhand: పెళ్లిలో గొడ్డలితో హల్‌చల్ చేసిన మొదటి భార్య.. వధువును చావగొట్టిన వైనం!

  • ప్రేమికురాలిని పెళ్లాడుతుండగా ఘటన
  • పోలీసులను ఆశ్రయించిన నవ వధువు
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు

పెళ్లి జరుగుతుండగా వరుడి మొదటి భార్య గొడ్డలితో వచ్చి వధువుపై దాడి చేసిన ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జంషెడ్ పూర్ లోని స్థానిక సుందర్‌నగర్‌కు చెందిన బీజేపీ నేత సుబోధ్ లోహ్రాకు సునీతా లోహ్రాతో ఇది వరకే వివాహమైంది. అయితే పూజా కర్మ్‌కార్ అనే మరో యువతితో ఆయన ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే పెళ్లికి మాత్రం సుబోధ్ నిరాకరించాడు. దీంతో పూజ పోలీసులను ఆశ్రయించింది.

రాజీ కుదిర్చిన పోలీసుల బలవంతంతో పూజను సుబోధ్ పెళ్లాడుతుండగా విషయం తెలిసిన మొదటి భార్య సునీత పెళ్లి జరుగుతున్న మండపానికి చేరుకుంది. గొడ్డలితో భయభ్రాంతులకు గురిచేసింది. వధువు పూజను పట్టుకుని చితక్కొట్టింది. ఆమె బారి నుంచి తప్పించుకున్న పూజ నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని మొరపెట్టుకుంది. సునీత నుంచి తనను కాపాడాల్సిందిగా వేడుకుంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News