shruti: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • సినిమా ప్రభావం లేదంటోన్న శ్రుతి హాసన్ 
  • అనుష్క 'భాగమతి' వచ్చేస్తోంది!
  • ఓంకార్ యాక్షన్ ఎంటర్ టైనర్ 
  • నాగచైతన్యతో అనూ ఇమ్మానుయేల్  

*  'సినిమా వేరు, జీవితం వేరు' అంటోంది కథానాయిక శ్రుతి హాసన్. "మొదటి నుంచీ కూడా నేను ఓ స్టార్ అయిన కమలహాసన్ కూతురిలా బతకలేదు. సాధారణ అమ్మాయిలానే పెరిగాను. సినిమా ప్రభావం నా మీద అసలు లేదు. ఇప్పుడు కూడా అంతే.. సినిమా వేరు, నిజ జీవితం వేరు.. దేని దారి దానిదే" అని చెప్పింది.
*  అనుష్క ప్రధాన పాత్ర పోషించిన 'భాగమతి' చిత్రం తమిళ వెర్షన్ ఆడియో వేడుక నిన్న చెన్నయ్ లో జరిగింది. అశోక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 26 న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
*  ఇటీవల 'రాజుగారి గది 2' చిత్రాన్ని రూపొందించిన ఓంకార్ దర్శకత్వంలో ఈసారి యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందనుంది. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తాడు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
*  ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' చిత్రాన్ని చేస్తున్న అక్కినేని నాగచైతన్య తన తదుపరి చిత్రాన్ని మారుతి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 19 నుంచి జరుగుతుంది. ఇందులో అనూ ఇమ్మానుయేల్ కథానాయికగా నటిస్తోంది.

More Telugu News