flip cart: మూడు రోజుల పాటు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్లు!

  • ఈ నెల‌ 21 నుంచి 23వ తేదీ వరకు
  • ఫ్లిప్‌కార్ట్ 'రిపబ్లిక్ డే సేల్‌' పేరుతో అమ్మకాలు
  • గెలాక్సీ ఎస్7 ఫోన్‌ రూ.26,990 కే
  • షియోమీ రెడ్‌మీ నోట్ 4 (64జీబీ) రూ.10,999కే

దేశీయ ప్ర‌ముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ 'రిపబ్లిక్ డే సేల్‌'ను నిర్వహించనుంది. ఇందులో భాగంగా భారీ డిస్కౌంట్ల‌ను అందించ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ ఆఫ‌ర్‌లను ఈ నెల‌ 21 నుంచి 23వ తేదీ వరకు అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు చెప్పింది. ఇందులో ల్యాప్‌టాప్‌లు, ఆడియో, కెమెరా యాక్ససరీలపై 60 శాతం డిస్కౌంట్ ఇవ్వ‌నుంది.

అలాగే టీవీల‌ను 70 శాతం వరకు డిస్కౌంట్‌తో పొంద‌వ‌చ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఫోన్‌ను రూ.26,990 కే సొంతం చేసుకోవ‌చ్చు. అలాగే షియోమీ ఎంఐ మిక్స్2ను రూ.32,999కు, షియోమీ రెడ్‌మీ నోట్ 4 (64జీబీ) రూ.10,999కు, మోటో జీ5 ప్లస్ రూ.10,999కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. అంతేకాదు, సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొంద‌వ‌చ్చు.  

More Telugu News