Andhra Pradesh: 20వ తేదీకి వాయిదాపడ్డ ఏపీ మంత్రి మండలి సమావేశం

  • ఓ ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
  • 20వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం
  • ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ప్రతిపాదనలు పంపాలి

నేడు నిర్వహించాల్సిన మంత్రి మండలి సమావేశం ఈ నెల 20వ తేదీకి వాయిదాపడ్డట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం 1వ బ్లాక్  మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ మందిరంలో ఈ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు సచివాలయ నియమ నిబంధనలను అనుసరించి సమయానికి ప్రతిపాదనలు పంపాలని ఆ ప్రకటనలో సీఎస్ కోరారు.

More Telugu News