BJP: నేను ప్ర‌సంగించిన ప్రతి చోటా ఇలా గోమూత్రంతో శుద్ధి చేస్తారా?: బీజేపీపై ప్ర‌కాశ్ రాజ్‌ ఫైర్

  • తాను ప్ర‌సంగించిన వేదిక‌ను గోమూత్రంతో శుద్ధి చేశార‌ని వ్యాఖ్య‌
  • ట్వీట్ ద్వారా వెల్ల‌డించిన న‌టుడు
  • క‌ర్ణాట‌క‌లోని సిర్సిలో ఓ కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించిన ప్ర‌కాశ్‌రాజ్‌

తాను ప్ర‌సంగించి వెళ్లిపోయిన త‌ర్వాత ఆ వేదిక‌ను భార‌తీయ జ‌న‌తా యువ మోర్చా స‌భ్యులు గోమూత్రంతో శుద్ధి చేశారంటూ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. ఈ విష‌యాన్ని ప్ర‌కాశ్ రాజ్ ఓ ట్వీట్ ద్వారా వెల్ల‌డించారు. తాను ప్ర‌సంగించిన అన్ని చోట్లా ఇలా శుద్ధి చేస్తారా? అంటూ ప్ర‌కాశ్ రాజ్ వారిని ప్ర‌శ్నించారు. తన వ్యాఖ్య‌ల‌కు మద్దతుగా ఆయ‌న ఓ పేప‌ర్ క్లిప్‌ని కూడా జ‌త‌చేశారు.

గ‌త‌వారం క‌ర్ణాట‌క‌లోని సిర్సిలో జ‌రిగిన 'మ‌న రాజ్యాంగం, మ‌న గౌర‌వం' అనే కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. అక్క‌డి ప్ర‌సంగంలో భాగంగా ఆయ‌న ఉత్త‌ర క‌న్న‌డ ఎంపీ, కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డేను విమ‌ర్శించారు. ఈ విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్‌గా సంక్రాంతి రోజున బీజేపీ యువ‌నేత‌లు వేదిక‌ను గోమూత్రంతో శుద్ధి చేశారు.

More Telugu News