Uttar Pradesh: 'జై మాతా దీ' అనమంటూ రోడ్డుపై యువకుడిని కర్రలతో చితక్కొట్టిన వైనం.. పోలీసులకు చిక్కిన వీడియో

  • ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముజ‌ఫర్‌న‌గ‌ర్‌లో ఘటన
  • వీడియో వైరల్
  • నలుగురిపై అట్రాసిటీ కేసులు నమోదు

దైవ దూష‌ణ చేశాడని, అలాగే తమ మనోభావాలను దెబ్బ తీశాడని ఆరోపిస్తూ ఓ ద‌ళిత‌ యువకుడిని కొంద‌రు క‌ర్ర‌ల‌తో చిత‌క‌బాదిన ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముజ‌ఫర్‌న‌గ‌ర్‌, క‌లాన్ పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. ఆ యువ‌కుడిని జై శ్రీరాం, జై మాతా దీ అన‌మంటూ ఓ హిందూ సేన ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన‌ట్లు తెలిసింది.

 ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్ ఎస్పీ ఓంవీర్ సింగ్ ఈ ఘ‌ట‌న‌పై మాట్లాడుతూ.. ఈ నెల 14న చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింద‌ని, బాధిత యువ‌కుడి పేరు విపిన్ కుమార్ (22) అని చెప్పారు. ఈ కేసులో నిందితులు రాహుల్, ధీరజ్, జోధా, కాకు అనే యువకుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. వారిపై అట్రాసిటీ నిరోధక చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు చెప్పారు. 

More Telugu News